తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2021, 3:27 AM IST

ETV Bharat / city

Loan: వెయ్యి కోట్ల రూపాయల రుణానికి బాండ్లు జారీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం కోసం బాండ్లు జారీ చేసింది. బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది.

Loan
రుణం

రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం కోసం బాండ్లు జారీ చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. 14 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ చేశారు. వీటి వేలం మంగళవారం ఆర్బీఐ నిర్వహించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 20 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. తాజాగా మరో వెయ్యి కోట్ల మొత్తానికి బాండ్లు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details