కరోనా మహమ్మారి నేపథ్యంలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాల నటుడిగా మంచి గుర్తింపు పొందిన తేజ సజ్జా ఈ చిత్రంలో కథా నాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంద్ర చిత్రంలో చిన్నప్పటి ఇంద్రసేనారెడ్డి పాత్రలో ఆకట్టుకున్న తేజ.. ఇటీవలే ఓ.. బేబీ చిత్రంలో కీలక పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నారు. తేజ పుట్టినరోజు సందర్బంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీరెడ్డి చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. తెలుగులోనే తొలిసారిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీ కాన్సెప్ట్ను పరిచయం చేస్తుండటం విశేషం.
కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘’జాంబీరెడ్డి’
కరోనా మహమ్మారి నేపథ్యంలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం జాంబీరెడ్డి. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ఈ మూవీతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. తేజ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు జాంబీరెడ్డి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘’జాంబీరెడ్డి’