ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. 14 న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అదే రోజు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రేపు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పురపాలక ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 12 న మరోసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
'పురపాలక ఎన్నికల నిర్వహణకు సిద్ధం'
పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. 14న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. రేపు అన్ని మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
nagireddy