తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 8:02 PM IST

ETV Bharat / city

పాఠశాలలో జంతువుల వధ.. మాంసం విక్రయం!

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను మాంసపు విక్రయ శాలలుగా, వధ కేంద్రాలుగా కొంతమంది ప్రబుద్ధులు వాడుకుంటున్నారు. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు, నగరపాలక అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి... బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో జరిగింది.

meat selling at school in ap
ప్రభుత్వ పాఠశాలలో మాంసం విక్రయం

కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని అనంతపురం జిల్లా శ్రీనివాస్​ నగర్​లో... కొంతమంది బడులను మాంసపు విక్రయ, వధ కేంద్రాలుగా, పశువుల కేంద్రాలుగా మార్చేశారు. అక్కడి ప్రాథమిక పాఠాశాలలో కొంతమంది వ్యక్తులు జంతువులను వధిస్తున్నారు.

అనంతరం అక్కడే వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నగరపాలక అధికారులు, పోలీసులు... పాఠశాల వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. పాఠశాలలో ఇటువంటి పనులు చేస్తే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details