తెలంగాణ

telangana

RAJASINGH: 'శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్థులను బహిష్కరించాలి'

By

Published : Aug 17, 2021, 6:01 PM IST

ఏపీలోని శ్రీశైల పుణ్యక్షేత్రం అన్యమతస్థులకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే, భాజపా నేత రాజాసింగ్ ఆరోపించారు. శ్రీశైలంలో అన్యమతస్థులను నిలువరించేందుకు నంద్యాల పార్లమెంటరీ భాజపా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చేపట్టే పోరాటానికి సహాయ, సహకారాలు అందివ్వనున్నట్లు ఆయన చెప్పారు.

RAJASINGH: 'శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్థులను బహిష్కరించాలి'
RAJASINGH: 'శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్థులను బహిష్కరించాలి'

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైల పుణ్యక్షేత్రం అన్య మతస్థులకు అడ్డాగా మారిందని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలంలో అన్యమతస్థులను నిలువరించడం కోసం నంద్యాల పార్లమెంటరీ భాజపా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చేపడుతున్న పోరాటానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని రాజాసింగ్​ చెప్పారు.

RAJASINGH: 'శ్రీశైల క్షేత్రంలో అన్యమతస్థులను బహిష్కరించాలి'

శ్రీశైలంలోనే కాకుండా ఏపీలోని అన్ని దేవాలయాల్లో అన్యమతస్థులను బయటకు పంపడానికి ఏపీ భాజపా పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోందని అన్నారు. దేశం మొత్తం హిందుత్వంతో వర్ధిల్లాలని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:KISHAN REDDY TOUR: కిషన్​రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఇంఛార్జీగా గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details