తెలంగాణ

telangana

ETV Bharat / city

సంబంధం లేని విషయాలను కేసీఆర్​కు అంటగడుతున్నారు: కొప్పుల

భాజపా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆరోపించారు. సంబంధం లేని విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్​కు అంటగడుతున్నారని మండిపడ్డారు.

By

Published : Nov 21, 2020, 8:19 PM IST

minister koppula eeshwar comments on bjp leaders
సంబంధం లేని విషయాలను కేసీఆర్​కు అంటగడుతున్నారు: కొప్పుల

రాష్ట్రంలో అవసరంలేని విషయాలను భాజపా ప్రస్తావించి కొత్త వాతావరణం సృష్టిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సంబంధంలేని విషయాలను కేసీఆర్‌కు అంటగట్టి బండి సంజయ్‌ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా సంజయ్‌ అరాచక వాగ్దానాలు చేస్తున్నారని కొప్పుల దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వందశాతం సెక్యులర్​ సీఎం అని మంత్రి పేర్కొన్నారు. నేతల మాటల తీరు 'పూటకు గతిలేదు మాటకు మతిలేదన్నట్లు'గా ఉందని ఎద్దేవా చేశారు. భాజపా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని కొప్పుల ఆరోపించారు. రాజకీయాల్లో నిబద్ధత లేని వ్యక్తి అని ఎంపీ అరవింద్‌నుద్దేశించి అన్నారు. ప్రజలు భాజపాకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇవీ చూడండి: 'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

ABOUT THE AUTHOR

...view details