మావోయిస్టు నేత మధుకర్ ను పోలీసులు క్రూరంగా హింసించి, హత్య చేశారని దండకారణ్య అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. ఈ మేరకు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో పేరుతో ఓ లేఖ విడుదలైంది. అనారోగ్యం కారణంగా వరంగల్ కు ఈ నెల 1వ తేదీన వెళ్లిన మధుకర్ను పోలీసులు అరెస్ట్ చేశారని సమత లేఖలో పేర్కొన్నారు.
'మావో నేత మధుకర్ను పోలీసులే హత్య చేశారు'
మావోయిస్టు నేత మధుకర్ను పోలీసులే క్రూరంగా హింసించి హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు దక్షిణ సబ్ జోనల్ బ్యూరో పేరుతో.. దండకారణ్య అధికార ప్రతినిధి సమత లేఖ విడుదల చేశారు.
మావోయిస్టు మధుకర్, మావోయిస్టు మధుకర్ మృతి, మధుకర్ మృతిపై మావోయిస్టుల లేఖ
అనారోగ్యం పాలైన మధుకర్కు కనీస వైద్య సేవలందించకుండా ఐదు రోజుల పాటు హింసించిన తర్వాత 6వ తేదీ కరోనాతో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని సమత ఆరోపించారు. గత నెల 27వ తేదీన ప్లాటూన్ కమాండర్ గంగాల్నూ పోలీసులు ఇదే తరహాలో హత్య చేశారని అన్నారు. మధుకర్కు శ్రద్ధాంజలి ఘటించిన దక్షిణ సబ్ జోనల్ బ్యూరో... ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.