తెలంగాణ

telangana

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులు

By

Published : Jan 3, 2021, 7:39 AM IST

తిరుపతిలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. గత పది రోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోయి తిరిగి ప్రారంభమైన తరుణంలో.. భక్తులు భారీగా తరలివచ్చారు.

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులు
ttd

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. గడిచిన పది రోజులుగా ఈ ప్రక్రియ నిలిపివేసిన తితిదే.. మళ్లీ ప్రారంభించింది. టోకెన్లు సొంతం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ.. భక్తుల రద్దీ దృష్ట్యా ముందుగానే ప్రక్రియ ప్రారంభించారు.

తిరుపతిలోని రెండు చోట్ల మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. ఫలితంగా.. విష్ణు నివాసంలో భక్తులు అధిక సంఖ్యలో గుమిగూడారు.

ఇదీ చదవండి:సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే

ABOUT THE AUTHOR

...view details