తెలంగాణ

telangana

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 546 కేసులు

By

Published : Jun 20, 2020, 9:41 PM IST

Updated : Jun 20, 2020, 10:54 PM IST

రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు

21:38 June 20

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 546 కేసులు

 రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 458 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 50 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,072కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 203 మంది మృతి చెందారు. కరోనా నుంచి 3,506 మంది కోలుకోగా.. 3,363 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Last Updated : Jun 20, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details