తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2021, 3:31 PM IST

ETV Bharat / city

CORONA: కరోనా కలకలం.. హాస్టల్​లో 16 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్​

ఏపీలో కరోనా మళ్లీ టెన్షన్​ పెడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల వసతి గృహంలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది.

Corona for 16 medical students
Corona for 16 medical students

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల వసతి గృహంలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం రెండు వందల మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 16 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా. బాబ్జి తెలిపారు.

పాజిటివ్‌ వచ్చిన వారిని వసతి గృహంలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇటీవల ఓ వైద్య విద్యార్థి దిల్లీలో శుభకార్యానికి హాజరై రావడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details