తెలంగాణ

telangana

భద్రకాళీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.. సీఎం కేసీఆర్​కు ఆహ్వానం

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరిగే దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అందింది. పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు శేషు సీఎంను ఆహ్వానించారు.

By

Published : Oct 15, 2020, 6:14 PM IST

Published : Oct 15, 2020, 6:14 PM IST

Updated : Oct 16, 2020, 3:30 PM IST

cm kcr is invited to navaratri celebrations
సీఎం కేసీఆర్​కు ఆహ్వానం

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ఈనెల 17 నుంచి దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఆహ్వానించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శేషు ప్రగతి భవన్​కు వెళ్లారు.

దేవీ నవరాత్రులకు సీఎంను ఆహ్వానించి.. గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతిఏడు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు కరోనా కారణంగా ఈ ఏడు భిన్నంగా జరగనున్నాయి. కరోనా నిబంధనలకు లోబడి ఈ ఉత్సవాలు జరపాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Last Updated : Oct 16, 2020, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details