ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు.. సీఎంకు పూర్ణకుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్.. స్వామివారి నూతన రథం ప్రారంభించారు.
గతేడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమైంది. రు.95 లక్షలతో 41 అడుగుల ఎత్తైన రథాన్ని ప్రభుత్వం చేయించింది. ఈనెల 28 వరకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి.
అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఇదీ చదవండి:న్యాయవాద దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు