2012లో మహబూబ్నగర్లో నిర్వహించిన తెరాస బహిరంగ సభకు అనుమతి లేదని నాలుగు రోజుల క్రితం కోర్టు నోటీసులు ఇచ్చారని భాజపా నేత విజయశాంతి తెలిపారు. ఆ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. కేసు పెడితే అతనిపై పెట్టాలని అన్నారు. 2012లో జరిగిన సంఘటనకు తొమ్మిదేళ్ల తర్వాత కేసు పెట్టించడంలోనే కేసీఆర్ భయం అర్థమవుతోందని పేర్కొన్నారు.
'9 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు కేసు పెట్టడమేంటి?' - bjp leader vijayashanthi
సీఎం కేసీఆర్.. తనపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. 2012లో జరిగిన సంఘటనకు.. తొమ్మిదేళ్ల తర్వాత కేసు పెట్టించడంలోనే కేసీఆర్ భయం అర్థమవుతోందని అన్నారు.

విజయశాంతి, నాంపల్లి కోర్టు
ఈ కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి.. సీఎం కేసీఆర్ తనపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకు నమ్మకం ఉందని.. ఆ దిశగా పోరాడతానని చెప్పారు. ఉద్యమకారులను హింసించడం సరికాదని అన్నారు.