తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 7:26 PM IST

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటి 39 లక్షలు దాటాయని వివరించింది.

ap corona cases
ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 8 లక్షల 89 వేల 916కు చేరింది. ఇప్పటివరకు వైరస్​ బారినపడి 7 వేల 169 మంది మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 66 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 8.82 లక్షలకు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 39 వేల 122 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు కోటి 39 లక్షలు దాటాయి.

ఇవీ చదవండి :న్యాయవాదులను నరికిన కత్తుల కోసం గజ ఈతగాళ్ల వేట

ABOUT THE AUTHOR

...view details