తెలంగాణ

telangana

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'

By

Published : Sep 30, 2019, 6:44 PM IST

ఈఎస్​ఐలో వందల కోట్లు కుంభకోణం జరిగిందని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్​ ఆరోపించారు. మందుల గోల్​మాల్​పై గత ఐదు నెలలుగా ఆందోళన చేసినట్లు గుర్తుచేశారు.

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'
ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్​ ఆరోపించారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. ఈఎస్​ఐలో మందుల గోల్​మాల్​పై గత ఐదు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏసీబీ విచారణ చేయించి ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు ఏడుగురిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేవలం రూ.11 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులంటున్నారని.. భారీ స్థాయిలో కుంభకోణం జరిగి, వందల కోట్ల నిధులు గల్లంతయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details