తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2022, 7:16 AM IST

Updated : Mar 27, 2022, 9:16 AM IST

ETV Bharat / business

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. అక్కడ సెంచరీ కొట్టిన డీజిల్

petrol price increased: పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50పైసలు, లీటర్​ డీజిల్​పై 55పైసలు వడ్డిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గుంటూరులో డీజిల్ ధర సెంచరీ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి.

petrol price increased
petrol price increased

petrol price increased: దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ డీజిల్​పై 55 పైసలు వడ్డించాయి. దీంతో పెట్రోల్ ధర రూ.99.11కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.90.42కు ఎగబాకింది. ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆరు రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగినట్లైంది.

Mumbai Petrol price:ముంబయిలో లీటర్ పెట్రోల్​పై 53 పైసలు, డీజిల్​పై 58 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.88కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.13గా ఉంది.
• తాజా బాదుడు తర్వాత.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90, డీజిల్ ధర రూ.95గా ఉంది. కోల్​కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.53, డీజిల్ రూ.93.57 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..
• ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 57 పైసలు, డీజిల్​పై 60 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.112.35కు పెరిగింది. డీజిల్ ధర రూ.98.68కి చేరుకుంది.
• విశాఖపట్నంలో పెట్రోల్ ధర 55 పైసలు పెరిగి.. రూ.113.08కు చేరింది. డీజిల్ లీటర్ ధర 58 పైసలు అధికమై.. రూ.99.09కు ఎగబాకింది.
• గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 54పైసలు అధికమై.. రూ.114.36కు చేరుకుంది. డీజిల్ ధర వంద రూపాయలు దాటింది. 57 పైసల పెంపుతో రూ.100.33కు చేరింది.

ఇదీ చదవండి:'వాటి కోసం మైక్రోసాఫ్ట్ రూ.వేల కోట్ల ముడుపులు'

Last Updated : Mar 27, 2022, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details