తెలంగాణ

telangana

Gold Rate Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

By

Published : Jun 9, 2023, 4:56 PM IST

Updated : Jun 9, 2023, 5:24 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
పెరిగిన బంగారం ధర

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి.. ప్రస్తుతం రూ.60,820కి చేరుకుంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.1,050 పెరిగి.. ప్రస్తుతం రూ.74,350గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,805గా ఉంది. కిలో వెండి ధర రూ.75,950కి చేరింది.

Gold price in Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,805గా ఉంది. కిలో వెండి ధర రూ.75,950కి చేరింది.

Gold price in Vishakhapatnam : వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,805కు చేరింది. కేజీ వెండి ధర రూ.75,950గా ఉంది.

Gold price in Proddatur : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ..61,805గా ఉంది. కేజీ వెండి ధర రూ.75,950కి చేరింది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,964 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.35 డాలర్ల వద్ద ఉంది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Market Today : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రోజు నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ, కాసేపటికే మార్కెట్లు ఊగిసలాట ధోరణిలోకి జారుకున్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువవడం వల్ల పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి.

సూచీలు ఇలా..
బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 223 పాయింట్లు నష్టపోయి 62,625 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 71 పాయింట్లు దిగజారి 18,563 వద్ద సెషన్​ను ముగించింది.

లాభాల్లో ఉన్న షేర్లు ఇవే..
సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..
టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.

రూపాయి విలువ..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 4 పైసలు లాభపడి రూ.82.47 వద్ద స్థిరపడింది.

పెట్రోల్ ధరలు ఇలా..
పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర 96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

Last Updated : Jun 9, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details