తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ పతనం నుంచి కోలుకున్న ​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఆర్​బీఐ దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు తగ్గించగా నిన్న భారీగా నష్టపోయిన సూచీలు... నేడు కాస్త కోలుకున్నాయి.

By

Published : Jun 7, 2019, 4:33 PM IST

భారీ పతనం నుంచి కోలుకున్న ​మార్కెట్లు

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన స్టాక్​మార్కెట్లు... చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 86 పాయింట్లు పెరిగి 39 వేల 616 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 11 వేల 871 వద్ద ముగిసింది.

దేశీయంగా, అంతర్జాతీయంగా మిశ్రమ పరిస్థితుల మధ్య సూచీలు రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 39 వేల 279 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. తర్వాత కోలుకుని 39 వేల 703 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. కాసేపటికే నెమ్మదించిన సూచీ... స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.
వారం మొత్తంగా సెన్సెక్స్​ 98 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు కోల్పోయింది.

లాభాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంకు, టెక్​ మహీంద్ర, బజాజ్​ ఫైనాన్స్​, ఎమ్​ అండ్​ ఎమ్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ, వేదాంత (సుమారు 1.90 శాతం) లాభాలను ఆర్జించాయి.

నష్టాల్లో..

డాక్టర్​ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్​ బ్యాంకు, పవర్​ గ్రిడ్​ కార్ప్​, సిప్లా, సన్​ ఫార్మా, కోల్​ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్​జీసీ, ఆర్​ఐఎల్​ (సుమారు 2.37 శాతం) నష్టపోయాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 20 పైసలు దిగజారి, అమెరికన్​ డాలర్​కు రూ.69.48లుగా ఉంది.

పెరిగిన చమురుధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.20 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 62.41 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'పరువు' కేసులు: శశికి బెయిల్- కేజ్రీకి సమన్లు

ABOUT THE AUTHOR

...view details