తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 3:38 PM IST

ETV Bharat / business

జోష్​ ఇవ్వని ఆర్​బీఐ- సెన్సెక్స్ 132 పాయింట్లు డౌన్

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 132 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ స్వల్పంగా 20 పాయింట్లు నష్టపోయింది.

stock market closing today
స్టాక్ మార్కెట్లు

గత సెషన్​ను రికార్డు లాభాలు నమోదుచేసిన సూచీలు.. వారాంతపు సెషన్​ను నష్టాలతో ముగించాయి. ​బీఎస్​ఈ-సెన్సెక్స్​ 132 పాయింట్లు తగ్గి 52,100 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 15,670 వద్దకు చేరింది.
వరుసగా ఆరో సారి రెపో, రివర్స్​ రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ మదుపరుల సెంటిమెంట్​ బలపడలేదు. వృద్ధి రేటు అంచనాలకు ఆర్​బీఐ కోత విధించడం సైతం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 52,389 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,953 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,734 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,622 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్, ఎల్​ అండ్​ టీ, ఓఎన్​జీసీ, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి.

నెస్లే, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐఎన్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ, రిలయన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఇవీ చదవండి:సంపన్నుల ఓటు 'షేర్​ మార్కెట్'​కే..

ABOUT THE AUTHOR

...view details