తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా దన్నుతో లాభాల బాటలో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమైంది. నిఫ్టీ 8,400 పాయింట్ల మార్క్​ను అందుకుంది.

By

Published : Mar 31, 2020, 10:51 AM IST

స్టాక్​ మార్కెట్లు
stock

చైనా మెల్లగా గాడినపడుతోందనే వార్తలతో మార్కెట్లకు ఊరట లభించింది. కంపెనీలకు ముడిసరకు సరఫరా పునరుద్ధరణ జరుగుతుందన్న నమ్మకంతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 800 పాయింట్లకు పైగా లాభంతో ఆరంభమవగా.. నిఫ్టీ 8,400 మార్క్​ను అందుకుంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 648 పాయింట్ల లాభంతో 29,089 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 193 పాయింట్లు వృద్ధితో 8,474 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో...

టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్​ బ్యాంక్, ఎమ్​ అండ్​ ఎమ్​, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్​జీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్ టెక్​, టైటాన్​ సంస్థలు దాదాపు 3 శాతం లాభపడ్డాయి.

నష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేరు 15 శాతం పడిపోయింది. బజాజ్​ ఫైనాస్స్​, బజాజ్​ ఆటో, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

షాంఘై సూచీ లాభాల్లో ఉంది. చైనాలో పరిశ్రమలు దాదాపు తెరుచుకున్నాయి. చైనావ్యాప్తంగా 98.6 శాతం భారీ పరిశ్రమలు ఉత్పత్తి పునరుద్ధరించాయి.

హాంకాంగ్​, టోక్యో, సియోల్​లో మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి.

రూపాయి...

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి రూ.75.48 వద్ద ఉంది.

చమురుధరలు...

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్​ 2.16 శాతం పెరిగింది. బ్యారెల్ ముడిచమురు ధర 26.99 డాలర్లకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details