తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2021, 4:45 PM IST

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం.. పెరిగిన వెండి

బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.108 తగ్గి.. రూ.48,877కు చేరింది.

gold prices today
నేటి బంగారం ధరలు

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశ రాజధానిలో బుధవారం 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.108 తగ్గి.. రూ.48,477కు చేరింది. కేజీ వెండి ధర రూ.144 పెరిగి రూ.65,351 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,857 డాలర్లుగా ఉంది. వెండి ధర 25.48 డాలర్లకు చేరింది.

రూపాయితో పోలిస్తే డాలర్ క్షీణత నేపథ్యంలో బంగారం ధరలు తగ్గాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ అనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details