తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక విధానాలపై ప్రధానికి నిపుణుల సలహాలు

ఆర్థికవేత్తలు, నిపుణులతో దిల్లీలోని నీతి ఆయోగ్​ కార్యాలయంలో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. నూతన ఆర్థిక విధానాలు, ఉద్యోగ కల్పన, వ్యవసాయం, విద్య వంటి పలు కీలక అంశాలపై వారి సలహాలు, సూచనలను స్వీకరించారు.

By

Published : Jun 22, 2019, 8:06 PM IST

ఆర్థిక విధానాలపై ప్రధానికి నిపుణుల సలహాలు

దిల్లీలోని నీతి ఆయోగ్​ కార్యాలయంలో 40 మంది ఆర్థికవేత్తలు, పలువురు నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 'ఆర్థిక విధానం-ముందున్న సవాళ్లు' ప్రధాన అజెండాగా భేటీ జరిగింది.

స్థూల ఆర్థిక వ్యవస్థ, ఉద్యగ కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక అంశాలపై మోదీకి సలహాలు, సూచనలు తెలియజేశారు ఐదు విభిన్న బృందాల నిపుణులు.

ఆర్థికవేత్తల సలహాలకు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

ఆర్థిక విధానాలపై ప్రధానికి నిపుణుల సలహాలు

ఇదీ చూడండి: జీఎస్టీపై కీలక నిర్ణయాలు: ఆధార్​తోనే రిజిస్ట్రేషన్​

ABOUT THE AUTHOR

...view details