పెట్టుబడులు సహా పలు రకాల క్రయ విక్రయాల కోసం నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శాఖ కొన్నాళ్లుగా కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్ ప్లాట్ఫామ్లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడి సాధనాల్లో నగదు వినియోగాన్ని తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది.
అలాంటి కొన్ని సాధానాలు, వాటిలో నగదు రూపంలో పెట్టుబడికి ఉన్న పరిమితుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
సేవింగ్స్, కరెంట్ ఖాతాలు..
వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్కు రూ.లక్ష పరిమితి. ఈ పరిమితి దాటినవారికి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు.
కరెంట్ ఖాతా ఉన్నవారికి డిపాజిట్ లిమిట్ రూ.50 లక్షలు. ఈ పరిమితి దాటి డిపాజిట్ చేసినవారికీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)..