తెలంగాణ

telangana

ఈ లిమిట్​ దాటితే ఐటీ నోటీసులు పక్కా!

By

Published : May 24, 2021, 6:57 PM IST

నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శాఖ నిబంధనలను కొన్నాళ్లుగా కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడి సాధానాల్లో నగదు లావాదేవీలపై పరిమితులు విధించింది. ఆ సాధనాలు ఏవి? వాటిపై పరిమితులు ఎంత? అనే వివరాలు మీకోసం.

Limit imposed by the IT Department on Real estate
పెట్టుబడుల్లో నగదు లావాదేవీలపై పరిమితులు

పెట్టుబడులు సహా పలు రకాల క్రయ విక్రయాల కోసం నగదు వినియోగాన్ని తగ్గించేందుకు ఆదాయ పన్ను శాఖ కొన్నాళ్లుగా కొత్త కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్​ ప్లాట్​ఫామ్​లు, రియల్​ ఎస్టేట్​ వంటి పెట్టుబడి సాధనాల్లో నగదు వినియోగాన్ని తగ్గించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తోంది.

అలాంటి కొన్ని సాధానాలు, వాటిలో నగదు రూపంలో పెట్టుబడికి ఉన్న పరిమితుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

సేవింగ్స్​, కరెంట్ ఖాతాలు..

వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్​కు రూ.లక్ష పరిమితి. ఈ పరిమితి దాటినవారికి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు.

కరెంట్ ఖాతా ఉన్నవారికి డిపాజిట్​ లిమిట్​ రూ.50 లక్షలు. ఈ పరిమితి దాటి డిపాజిట్​ చేసినవారికీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఫిక్స్​డ్​ డిపాజిట్​ (ఎఫ్​డీ)..

ఎఫ్​డీ ఖాతాలో నగదు రూపంలో డిపాజిట్ లిమిట్​ రూ.10 లక్షలుగా ఉంచింది ఆదాయ పన్ను శాఖ. రూ.10 లక్షలకు మించి ఎఫ్​డీల్లో డిపాజిట్​ చేస్తే.. నోటీసులు పంపిస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్​, స్టాక్ మార్కెట్లు, బాండ్లు, డిబెంచర్లు..

వ్యక్తిగత పెట్టుబడిదారులు.. పైన పేర్కొన్న పెట్టుబడి సాధనాల్లో రూ.10 లక్షలకు మించి నగదు రూపంలో పెట్టుబడిగా పెడితే.. ఆదాయ పన్ను శాఖ మీ ఐటీఆర్​ను తనిఖీ చేయొచ్చు.

రియల్టీ..

ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయానికి నగదు రూపంలో రూ.30 లక్షల కన్నా ఎక్కువగా చెల్లించేందుకు అనుమతి లేదని ఆదాయపు పన్ను నిబంధనలు చెబుతున్నాయి. ఈ పరిమితికి మించి నగదు రూపంలో చెల్లింపులు జరిపితే నోటీసులు ఇస్తుంది.

ఇవీ చదవండి:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details