తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ ఎగవేతదారులపై సీబీఐసీ ఉక్కుపాదం

జీఎస్​టీ ఎగ్గొట్టే కంపెనీల భరతం పట్టేందుకు సిద్ధమైంది కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు. ఎగవేతదారులకు ఎలాంటి అవకాశం లేకుండా కొత్త దరఖాస్తు చేసుకునేవారు గత దస్త్రాల వివరాలను పొందుపరిచేలా చూడాలని ఆదాయ పన్ను శాఖకు తాజా ఆదేశాలు జారీచేసింది.

By

Published : Mar 31, 2019, 2:58 PM IST

జీఎస్​టీ

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) ఎగవేతకు పాల్పడుతున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ).జీఎస్​టీ నమోదుకు మొదట చేసుకున్న దరఖాస్తును రద్దు చేయకుండానే కొత్త దరఖాస్తు చేసుకునే కంపెనీలపై దృష్టి సారించాలని ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది.

ప్రస్తుతం ఉన్న జీఎస్​టీ నమోదు ప్రక్రియలో లోపాల కారణంగా జీఎస్​టీ వసూళ్లు తగ్గి... లక్ష్యాలు అందుకోవడం కష్టమవుతోందని సీబీఐసీ పేర్కొంది.ప్రధానంగా జీఎస్​టీ నమోదు ప్రక్రియలో లొసుగులను ఉపయోగించుకుని కొన్ని వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడుతున్న కంపెనీలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సీబీఐసీ.

జీఎస్​టీకి మొదట దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ కారణంతోనైనా అది ఆమోదం పొందకపోతే ఆ విషయాన్ని రెండో సారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత శాఖకు తెలపాలి. అయితే కంపెనీలు ఆ విషయాన్ని దాచి రెండోసారి దరఖాస్తు చేసుకుంటున్నాయి. రెండవ సారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే... అప్పటి నుంచే జీఎస్​టీ చెల్లిస్తున్నాయి. దీంతో మొదటిసారి దరఖాస్తుకు, రెండోసారి దరఖాస్తుకు మధ్యనున్న కాలానికి జీఎస్​టీని ఎగ్గొడుతున్నాయి.

ఇలా రీ-రిజిస్ట్రేషన్​ మార్గంలో జీఎస్​టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సీబీఐసీ తాజా నిబంధనలను తీసుకువచ్చింది. ఇందుకు రిజిస్ట్రేషన్​ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సూచించింది.

దరఖాస్తు చేసిన కంపెనీల పాన్ ఆధారంగా ఇంతకు ముందు రిజిస్ట్రేషన్​ వివరాలను తెలుసుకోవాలని... వాటి ద్వారా ఏమైనా పాత బాకీలు ఉంటే వాటినీ పన్నులో లెక్కగట్టి వసూలు చేయాలని పేర్కొంది.

బడ్జెట్​ సమావేశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ. 7.43 లక్షల కోట్ల జీఎస్​టీ వసూళ్లకుగానూ... రూ. 6.43 లక్షల కోట్లు మాత్రమే వస్తాయని సీబీఐసీ అంచనా వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details