తెలంగాణ

telangana

ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు

By

Published : Nov 17, 2019, 4:11 PM IST

జాతీయ రహదారుల అథారిటీ పరిధిలోని అన్ని టోల్​ గేట్లలో డిసెంబర్​ 1 నుంచి ఎలక్ట్రానిక్​ టోల్​​ను తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని 100 శాతం అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.

ఫాస్టాగ్​తో​ టోల్​ వసూలు కోసం ప్రత్యేక అధికారులు

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 100 శాతం ఎలక్ట్రానిక్​ టోల్​ వసూలుకు కేంద్రం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ టోల్ విధానం తప్పనిసరి చేయనున్నట్లు రోడ్డు రవాణా,రహాదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్​ను నియంత్రించడం సహా ఇతర సమస్యలను తొలగించేందుకు కేవలం ఫాస్టాగ్​ల ద్వారా మాత్రమే టోల్​ రుసుముల చెల్లింపులు జరిపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. నేషనల్​ ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ (ఏఈటీసీ) పేరుతో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ విధానం అమలైనప్పటికీ టోల్ ప్లాజాల ఒక వద్ద హైబ్రిడ్​ లైన్​ను ఉంచనున్నట్లు వెల్లడించింది కేంద్రం. ఈ లైన్​లో ఫాస్టాగ్​ సహా అన్ని విధానాల్లో చెల్లింపులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు..

దేశవ్యాప్తంగా అన్ని టోల్​ ప్లాజాల వద్ద 100 శాతం ఎలక్ట్రానిక్​ టోల్​ వసూలు (ఈటీసీ) ప్రక్రియను అమలు చేసేందుకు రాష్ట్రాల వారీగా ప్రభారీ అధికారులను నియమించింది కేంద్రం.

ఈటీసీ విధానాన్ని పర్యవేక్షిస్తూ జాతీయ రహదారుల అథారిటీ(ఎన్​హెచ్​ఏఐ) తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, సమస్యలను పరిష్కరించటమే వీరి కర్తవ్యం.

ఇతర కీలక అంశాలు..

  • దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లను ఫాస్టాగ్ ఆధారిత చెల్లింపులు జరిపేందుకు సిద్ధం చేసింది ఎన్​హెచ్​ఏఐ.
  • దేశవ్యాప్తంగా మొత్తం 23 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, అమెజాన్​, పేటీఎంలో ఫాస్టాగ్​లు కొనుగోలు చేసే వీలుంది.
  • నేరుగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్​లను కొనే సౌకర్యం ఉంది.
  • ప్రస్తుతం ఈ విధానం ప్రారంభదశలో ఉన్న కారణంగా త్వరగా వినియోగదారులను ఆకర్షించేందుకు 2.5 శాతం క్యాష్​బ్యాక్​ ఆఫర్​ను ఇస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ఆఫర్ ఉండనుంది.
  • ఎన్​హెచ్​ఏఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి దేశవ్యాప్తంగా 60 లక్షల ఫాస్టాగ్​​లు జారీ అయ్యాయి.
  • ఫాస్టాగ్​​ల ద్వారా మొత్తం రూ.12,850 కోట్లు ఈటీసీ పద్ధతిలో గడించింది ఎన్​హెచ్​ఏఐ.

ఇదీ చూడండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details