తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో దెబ్బకు సెప్టెంబర్​లోనూ.. దిగ్గజ సంస్థల విలవిల

టెలికాం రంగంలో మరో గట్టిపోటీ కనిపిస్తోంది. సెప్టెంబర్​ నెలకుగానూ వొడాఫోన్ఐడియా, భారతీఎయిర్​టెల్​లు రెండు కలిపి 49 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. ఇదే సమయంలో జియో 69.83 లక్షల మంది యూజర్లను పెంచుకుంది.

By

Published : Nov 20, 2019, 7:00 AM IST

Updated : Nov 20, 2019, 11:07 AM IST

జియో దెబ్బకు సెప్టెంబర్​లోనూ.. దిగ్గజ సంస్థల విలవివల

ఈ ఎడాది సెప్టెంబర్​లోనూ వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్​టెల్​లు భారీగా యూజర్లను కోల్పోయాయి. ఈ రెండు సంస్థలకు కలిపి సెప్టెంబర్​లో 49 లక్షల మంది యూజర్లు దూరమైనట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ వెల్లడించింది.

జియో మాత్రం సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకున్నట్లు ట్రాయ్​ గణాంకాల్లో వెల్లడైంది.

సెప్టెంబర్​ నెలలో మొత్తం.. వైర్​లెస్​ (జీఎస్​ఎం, సీడీఎంఐ, ఎల్​టీఈ)చందాదార్లు 117.37 కోట్లకు పెరిగారు. ఈ సంఖ్య ఆగస్టు ముగింపు నాటికి 117.1కోట్లుగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో వైర్​లెస్​ చందాదారుల సంఖ్య 65.91 కోట్లకు తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో 51.45 కోట్లకు పెరిగింది.

నెట్​వర్క్​ల వారీగా చూస్తే సెప్టెంబర్​ చివరి నాటికి గణాంకాలు..

  • సెప్టెంబర్​లో వొడాఫోన్-ఐడియా అత్యధికంగా 25.7 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
  • భారతీ ఎయిర్​టెల్​కు సెప్టెంబర్​లో 23.8 లక్షల మంది వినియోగదారులు తగ్గారు
  • సెప్టెంబర్​లో 69.83 లక్షల మంది కొత్తగా రిలయన్స్ జియోను ఎంచుకున్నారు.
  • ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు.. బీఎస్​ఎన్​ఎల్​ 7.37 లక్షల యూజర్లను సెప్టెంబర్​లో పెంచుకుంది. అయితే ఎంటీఎన్​ఎల్ మాత్రం 8,717 మంది యూజర్లు కోల్పయింది.

సెప్టెంబర్​ నాటికి మొత్తం యూజర్లు.. మార్కెట్​ వాటా

టెలికాం సంస్థ మొత్తం యూజర్లు మార్కెట్​ వాటా
వొడాఫోన్​-ఐడియా 37.24 కోట్లు 31.73 శాతం
భారతీఎయిర్​టెల్​ 32.55 కోట్లు 27.74 శాతం
రిలయన్స్ జియో 35.52 కోట్లు 30.26 శాతం
బీఎస్​ఎన్​ఎల్​ 11.69 కోట్లు -
ఎంటీఎన్​ఎల్​ 33.93 లక్షలు -
Last Updated : Nov 20, 2019, 11:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details