ఆన్లైన్ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ భారత్లో సేవలను విస్తరించాలని భావిస్తోంది. ప్రస్తుతం కార్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు, బోట్ విభాగాల్లో మాత్రమే సేవలందిస్తున్న ఉబర్ ఇప్పుడు బస్సు సర్వీసుల్ని కూడా ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దిల్లీ మెట్రో భాగస్వామ్యంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫీచర్తో కూడిన ఉబర్ యాప్ను ఇటీవల ఆవిష్కరించింది.
ఈ నూతన యాప్తో వినియోగదారులకు దిల్లీ మెట్రో స్టేషన్ల నుంచి లేదా మెట్రో మార్గంలో పబ్లిక్ బస్సులకు సంబంధించిన సమాచారం యాప్లో కనిపించనుంది. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం దేశ రాజధానికే పరిమితం చేయనున్నారు. వినియోదారుల స్పందన ఆధారంగా మిగతా నగరాలకూ విస్తరించే యోచనలో ఉన్నామని ఉబర్ సీఈఓ దాదా ఖోస్రోషాహీ తెలిపారు. పూర్తి స్థాయి ఉబర్ బస్సు యాప్ని ప్రారంభించాలా వద్దా అనేదీ అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉబర్ బస్సు సేవలు ఈజిప్టు రాజధాని కైరోలో అందుబాటులో ఉన్నాయి.
ఎసీబస్సులో ఎక్కడికైనా..