తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2019, 2:35 PM IST

Updated : Sep 26, 2019, 6:13 PM IST

ETV Bharat / business

రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే

ముంబయిలోని ఓ హోటల్​ ఉడకబెట్టిన రెండు కోడి గుడ్లను రూ.1700కు అమ్మారని వాపోయాడు కార్తీక్​ ధర్ అనే నెటిజన్​. అరటి పండ్లతో కొన్ని స్టార్​ హోటళ్ల నిర్వాకాన్ని బయటపెట్టిన నటుడు రాహుల్ బోస్​ను ట్యాగ్​ చేస్తూ చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది.

రెండు కోడిగుడ్ల ధర రూ.1700 మాత్రమే

రెండు అరటిపళ్లకు రూ.442 బిల్లు వేసి బాలీవుడ్‌ నటుడు రాహుల్‌బోస్​కు ఓ హోటల్‌ చుక్కలు చూపించింది. ఈ ఘటనను మరువకముందే ముంబయిలోని మరో హోటల్‌ ఓ వినియోగదారుడికి షాకిచ్చింది. ఉడకబెట్టిన రెండు కోడి గుడ్లకు రెస్టారెంట్​ వేసిన రూ.1700 బిల్లు చూసి కార్తీక్‌ధర్‌ అనే నెటిజన్ ఆశ్చర్యపోయాడు.

గుడ్లకే కాదు.. రెండు ఆమ్లెట్లకు కూడా అదే ధర వేశారు. ఈ బిల్లు ప్రతిని కార్తీక్ ట్వీట్​ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దానిని రాహుల్‌ బోస్‌కు ట్యాగ్​ చేసి సోదరా! మనం ఆందోళన చేద్దామా? అంటూ ట్వీట్‌ చేశాడు.

స్పందించిన నెటిజన్లు ఆ గుడ్డులో బంగారం ఏమైనా ఉందేమోనని ఛలోక్తులు విసిరారు.

ఇదీ చూడండి: 'రెండు అరటిపండ్లు'-తాజా వ్యాపార ప్రచారాస్త్రం

Last Updated : Sep 26, 2019, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details