తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 8:11 AM IST

ETV Bharat / business

మరో ముగ్గురు పీఎంసీ బ్యాంక్ డైరెక్టర్లు అరెస్ట్​

మరో ముగ్గురు పీఎంసీ బ్యాంకు డైరెక్టర్లను అరెస్టు చేశారు ముంబయి పోలీసులు. పీఎంసీ బ్యాంక్​ కుంభకోణం కేసు విచారణలో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

PMC
పీఎంసీ బ్యాంక్​ కుంభకోణం

పంజాబ్​,మహారాష్ట్ర కోఆపరేటివ్​(పీఎంసీ​)బ్యాంక్​కుచెందిన ముగ్గురు డైరెక్టర్లను ముంబయి ఆర్థిక నేరాల విభాగ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.4,355 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా వీరిని అరెస్టు చేశారు. దీనితో పీఎంసీ కుంభకోణంలో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 12కి చేరింది.

హౌసింగ్​ డెవలప్​మెంట్​ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ (హెచ్​డీఐఎల్​)కు ఇచ్చిన రుణాల అంశంపై దర్యాప్తు చేసేందుకు.. పీఎంసీ డైరెక్టర్లు జగదీశ్​ మూఖే, ముక్తి బవిసి, త్రిపాఠి బానేలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో మూఖే 2005 నుంచి బ్యాంకు డైరెక్టర్​గా, ఆడిట్​ కమిటీ సభ్యునిగా ఉన్నట్లు పేర్కొన్నారు. బవిసి 2011 నుంచి డైరెక్టర్.. లోన్లు, అడ్వాన్సుల కమిటీ సభ్యునిగా ఉన్నట్లు వెల్లడించారు.

త్రిపాఠి బానే 2010 నుంచి 2015 వరకు లోన్​ రికవరీ కమిటీ సభ్యుడిగా.. ఆ తర్వాత 2015 నుంచి లోన్లు, అడ్వాన్సుల కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.

ఇదీ చూడండి:షియోమీ బంపర్​ ఆఫర్​.. నిమిషాల్లో రూ.లక్ష రుణం!

ABOUT THE AUTHOR

...view details