తెలంగాణ

telangana

ETV Bharat / business

'జియో' ఇప్పుడు నెం.1 టెలికాం సంస్థ

రిలయన్స్ జియో దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది. మార్కెట్లోకి ప్రవేశించిన మూడేళ్లకే ఈ ఘనత సాధించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియోకు ప్రస్తుతం 33.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

By

Published : Jul 27, 2019, 5:15 PM IST

'జియో'

మార్కెట్లోకి ప్రవేశిస్తూనే ప్రత్యర్థి సంస్థలకు దడ పుట్టించిన రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకే 33.1 కోట్ల మంది యూజర్లతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్​గా అవతరించింది.

ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న వొడఫోన్ ఐడియా యూజర్లు జూన్​ నాటికి 32 కోట్లకు తగ్గారు. మార్చిలో ఈ సంస్థకు 33.4 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 2019-20 తొలి త్రైమాసిక ఫలితాల్లో భాగంగా ఈ గణాంకాలు వెల్లడించింది వొడాఫోన్ ఐడియా.

గత వారమే 2019-20 క్యూ1 ఫలితాలు ప్రకటించిన రిలయన్స్.. జియో యూజర్లు 33.1 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది.

ఇటీవలే రెండో స్థానం.. అంతలోనే టాప్​

టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' దేశంలోని టెలికాం సంస్థల వినియోగదారుల గణాంకాలను ఇటీవలే ప్రకటించింది. మే చివరి నాటికి 32.2 కోట్ల యూజర్లతో ఎయిర్​టెల్​ను వెనక్కు నెట్టి 'జియో' రెండో స్థానానికి ఎగబాకినట్లు పేర్కొంది. మే చివరి నాటికి ఎయిర్​టెల్​కు 32.03 కోట్ల వినియోగదారులు ఉన్నారు.

మేలో రెండో స్థానానికి ఎగబాకిన రిలయన్స్ జియో.. కేవలం ఒక్క నెలలోనే (జూన్ చివరినాటికి) అగ్ర స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: గెలాక్సీ ఫోల్డ్​ ఫోన్​పై బంపర్​ ఆఫర్​ భారత్​కే!

ABOUT THE AUTHOR

...view details