మూలధనానికి రూ. 4వేలకోట్ల నిధులను సమకూర్చుకోనున్నట్లు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ట్రెంచ్లకు బాండ్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో సమకూర్చుకోవాలని బ్యాంకు భావిస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఇందుకు అనుమతించిందని నియంత్రణ సంస్థకు నివేదించింది.
బ్యాంకు ఎండీ, సీఈఓగా రాకేశ్ శర్మ పదవీ కాలాన్ని పొడగిస్తూ తాజా నియమకానికి డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు పేర్కొంది ఐడీబీఐ. దీంతో పాటు బ్యాంకు అదనపు డైరెక్టర్గానూ ఆయన కొనసాగనున్నారు. ఈ నియామకానికి ఆర్బీఐ అనుమతి కూడా లభించింది. రాకేశ్ శర్మ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.