తెలంగాణ

telangana

ప్రభుత్వ టెలికాం సంస్థలకు మంచి రోజులొచ్చేనా.!

By

Published : Apr 5, 2019, 12:55 AM IST

Updated : Apr 5, 2019, 1:01 AM IST

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్​ఎన్​ఎల్​, ఎంటీఎన్​ఎల్​ల రుణ విముక్తికి సహకరించనుంది కేంద్ర ప్రభుత్వం. మూడు సూత్రాల పథకం ద్వారా రెండు సంస్థలను అప్పుల నుంచి బయటపడేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పెట్టుబడిదారులైన స్నేహితులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

బీఎస్​ఎన్​ఎల్​

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన భారత్ సంచార్​ నిగమ్​ లిమిటెడ్(బీఎస్​ఎన్​ఎల్), మహానగర సంచార్​ లిమిటెడ్(ఎమ్​టీఎన్​ఎల్)లను రుణాల ఊబి నుంచి బయటపడేసేందుకు అవసరమైన చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. మూడు సూత్రాల పథకం ద్వారా ఆ సంస్థలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకుంది.

ఈ విషయమై టెలికాం, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, వాలంటరీ రిటైర్మెంట్ పథకానికి నిధుల మంజూరు, తక్షణ ఆర్థిక సహాయాలకు సూత్రప్రాయంగా అంగీకరించింది కేంద్రప్రభుత్వం.

ప్రస్తుతం టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీలో ప్రభుత్వ సంస్థలు నిలదొక్కుకునేందుకు ఈ మూడు చర్యలను చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఎంటీఎన్​ఎల్, బీఎస్​ఎన్​ఎల్ రెండింటికీ పునరుత్తేజం కల్పించేందుకు ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు పీఎంఓ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు సంస్థలకు చేయూతనిచ్చేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.

14వేల కోట్లఅప్పులు...

మిగతా ఆపరేటర్లతో పోల్చితే అతితక్కువ అప్పులతో ఉంది బీఎస్​ఎన్​ఎల్. సంస్థపైరూ.14,000 వేల కోట్ల రుణభారం ఉంది. 4జీ స్పెక్ట్రమ్​ అనుమతుల కోసం మరో రూ. 7వేల కోట్లుఖర్చయ్యే అవకాశం ఉంది.

ఉద్యోగుల కోసం గుజరాత్ విధానం...

అధికంగా ఉన్న ఉద్యోగులు రెండు సంస్థలకు భారంగా మారారు. బీఎస్​ఎన్​ఎల్​లో లక్షా 76వేల మంది, ఎంటీఎన్​ఎల్​లో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసేవారికి గుజరాత్ తరహా విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి సంస్థలు. ఈ ప్రణాళిక కింద... పూర్తి చేసిన సేవా సంవత్సరాల 35 రోజుల జీతం, పూర్తి చేయాల్సిన సంవత్సరాలకు సంబంధించిన స్కేల్​తో 25 రోజుల జీతాన్ని అందిస్తారు.

కాంగ్రెస్ విమర్శలు...

పెట్టుబడిదారులైన తన స్నేహితులకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​లను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. సరైన రీతిలో నిధులు కేటాయించకుండా ఆ సంస్థలు మూతపడేలా కుట్ర చేశారన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిరణ్​దీప్ సుర్జేవాలా. ఈ నెల 6లోగా రూ. 11వేల కోట్లు చెల్లించి ఎమ్​టీఎన్​ఎల్ తన లైసెన్స్​ను పునరుద్ధరించుకోవాలని, లేనట్లయితే 7.7 కోట్ల వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటారన్నారు.

స్నేహితుల కంపెనీలను వేలకోట్ల అప్పుల నుంచి బయటపడేస్తున్న ప్రభుత్వం... బీఎస్​ఎన్​ఎల్​ వంటి సంస్థలకు చేయూతనిచ్చేందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు సుర్జేవాలా. ప్రభుత్వ విధానాలు ప్రైవేటు సంస్థలకు మేలు చేకూర్చేవిగా ఉన్నాయని ఆరోపించారు.

Last Updated : Apr 5, 2019, 1:01 AM IST

ABOUT THE AUTHOR

...view details