తెలంగాణ

telangana

ETV Bharat / business

టెలికాం శాఖకు 10 వేల కోట్లు చెల్లించిన ఎయిర్​టెల్​

టెలికాం శాఖకు ఏజీఆర్​ రూపంలో బకాయి పడ్డ రూ.35వేల కోట్లలో రూ.10 వేల కోట్లను నేడు చెల్లించింది భారతీ ఎయిర్​టెల్​. మిగిలిన మొత్తాన్ని సుప్రీం తదుపరి విచారణకు ముందే జమ చేస్తామని స్పష్టం చేసింది.

By

Published : Feb 17, 2020, 11:52 AM IST

Updated : Mar 1, 2020, 2:39 PM IST

dot, airtel
ఎయిర్​టెల్​

ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఎయిర్​టెల్​ తొలి దఫాగా రూ.10వేల కోట్లు జమ చేసింది. సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఏజీఆర్​ బకాయిల చెల్లింపునకు టెలికాం శాఖ డెడ్​లైన్​ను పొడిగించేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బకాయిలు కట్టేందుకు ఎయిర్​టెల్​ సిద్ధమయింది.

"భారతీ ఎయిర్​టెల్​, భారతి హెక్సాకామ్​, టెలినార్ తరఫున మొత్తం రూ.10వేల కోట్లు జమచేశాం. స్వీయ పరిశీలన తర్వాత సుప్రీం తదుపరి విచారణకు ముందే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తాం. "

-భారతీ ఎయిర్​టెల్​

కోర్టు ఆగ్రహంతో కసరత్తు ముమ్మరం..

ఏజీఆర్ బాకాయిలు రూ.1.47 కోట్లు టెల్కోలు చెల్లించాల్సిందేనని.. ఎలాంటి గడువు పెంచే యోచన లేదని సుప్రీంకోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో టెలికాం సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఫిబ్రవరి 20న రూ.10,000 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లిస్తామని ఎయిర్​టెల్​ తెలిపింది. అయితే బకాయిల చెల్లింపునకు టెల్కోలకు ఎలాంటి గడువు పెంచే యోచన లేదని టెలికాం శాఖ (డీఓటీ) తేల్చిచెప్పింది.

చర్యలకు సిద్ధమైన డీఓటీ..

ఏజీఆర్​ బకాయిలు చెల్లించేందుకు టెలికాం సంస్థలకు గత శుక్రవారం అర్ధరాత్రి వరకే గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆ సమయానికి బకాయిలు చెల్లించని టెల్కోలపై చర్యలకు సిద్ధమైంది డీఓటీ. శని, ఆది వారాలు సెలవు దినాలు అయినందున సోమవారం నుంచి ఆయా సంస్థలకు నోటీసులు పంపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డీఓటీ ఇటీవల స్పష్టం చేసింది.

Last Updated : Mar 1, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details