తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 7:14 PM IST

ETV Bharat / business

షియోమీ బంపర్​ ఆఫర్​.. నిమిషాల్లో రూ.లక్ష రుణం!

రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎన్నో యాప్​లు వచ్చాయి. వీటితో నిమిషాల్లో పని జరిగిపోతోంది. అదే విధంగా ఆలోచించిన చైనా దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ కూడా ఓ లెండింగ్​ ప్లాట్​ఫాం తీసుకొచ్చింది. ఈ యాప్​ ద్వారా వినియోగదారులకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలివ్వనున్నట్లు తెలిపింది.

xiaomi-launches-mi-credit-in-india-to-offer-up-to-rs-1-lakh-personal-loan
షియోమీ బంపర్​ ఆఫర్​.. నిమిషాల్లో రూ.లక్ష రుణం!

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్​ తయారీదారు షియోమీ.. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ లెండింగ్​ ప్లాట్​ఫాంను అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటివరకు ఎంఐ క్రెడిట్​ను ప్రయోగాత్మకంగా నడిపింది.

దీని ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు రుణాలు పొందవచ్చు. 'క్రెడిట్​బీ' భాగస్వామ్యంతో రుణాలివ్వనున్నట్లు గతేడాది ప్రకటించిన షియోమీ... ప్రస్తుత ఫార్మాట్​లో అది లేదని వెల్లడించింది. వినియోగదారులకు రుణాలు ఇచ్చేందుకు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ సాలరీ, క్రెడిట్ విద్య, జెస్ట్ మనీ తదితర ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది.

ప్రత్యేకతలు...

  • 100 శాతం డిజిటల్​
  • 5 నిమిషాల్లోనే​ దరఖాస్తు ప్రక్రియ పూర్తి
  • హై సక్సెస్​ రేట్​, అధిక మొత్తం రుణం, తక్కువ వడ్డీ రేట్లు
  • ఫ్రీ క్రెడిట్​ స్కోర్​
  • సమాచార గోప్యత

10 రాష్ట్రాలకుపైగా అందుబాటులో..

ప్రస్తుతం 'ఎంఐ క్రెడిట్​' సేవలు 10 రాష్ట్రాలకుపైగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 100 శాతం పిన్​కోడ్​లలో రుణ సౌలభ్యం కల్పిస్తామని ఆ సంస్థ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details