తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనసాగుతున్న స్టాక్ ​మార్కెట్ నష్టాల పరంపర

స్టాక్​మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. విదేశీ నిధులు ఉపసంహరణ కొనసాగుతుండడం, నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలు ఇందుకు కారణం. సెన్సెక్స్​ 37 వేల మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 10 వేల 878 వద్ద ట్రేడవుతోంది.

By

Published : Aug 2, 2019, 10:02 AM IST

కొనసాగుతున్న స్టాక్ ​మార్కెట్ నష్టాల పరంపర

బలహీన ఆర్థిక గణాంకాలు, విదేశీ నిధుల ఉపసంహరణ, నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఇవాళ కూడా స్టాక్ ​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్ మరోమారు 37 వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 325 పాయింట్లు కోల్పోయి 36 వేల 692 వద్ద కొనసాగుతోంది.

నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 11 వేల దిగువనే కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం 101 పాయింట్లు నష్టపోయి 10 వేల 878 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

భారతీ ఎయిర్​టెల్​, ఇన్ఫోసిస్​, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

గెయిల్, ఓఎన్​జీసీ, హీరో మోటోకార్ప్​, వేదాంత, కోల్​ఇండియా, బజాజ్​ ఆటో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details