దేశంలోనే అతి పెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జనవరి 10 నుంచి రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ) పై వడ్డీ రేట్లను తగ్గించింది. తాజా సవరణ తరువాత, ఒక సంవత్సరం రికరింగ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఎస్బీఐ 6.10 శాతం వడ్డీని అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఆర్డీలకు బ్యాంకు 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని తగ్గించింది. ఇంతకు ముందు ఈ రికరింగ్ డిపాజిట్లు 6.25 శాతం వడ్డీ రేటును అందించేవి, కానీ తాజా సవరణ తరువాత, ఈ ఆర్డీ ఖాతాలు 6.10 శాతం వడ్డీ రేటును పొందుతాయి.
జనవరి 10, 2020 నుంచి అమలులోకి వచ్చిన ఎస్బీఐ తాజా ఆర్డీ వడ్డీ రేట్ల వివరాలు :
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.10 శాతం