తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2021, 10:42 AM IST

ETV Bharat / business

పెట్రో వాత.. వరుసగా మూడో రోజు పెరిగిన ఇంధన ధరలు

దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price Today) మళ్లీ పెరిగాయి. తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. (Petrol Diesel Price Hike)

petrol diesel price
పెట్రో వాత.. వరుసగా మూడో రోజు పెరిగిన ఇంధన ధరలు

దేశ ప్రజలపై మళ్లీ పెట్రో (Petrol Price Today) పిడుగు పడింది. వరుసగా మూడో రోజు ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​పై 25 పైసలు వడ్డించింది (Petrol Price in Delhi) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. డీజిల్​పై 30 పైసలు అధికం చేసింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. (Petrol Diesel Price Hike) ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.14 ఉండగా.. డీజిల్ ధర 90.47కు చేరుకుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.108.15గా ఉంది. డీజిల్ ధర రూ.98.12కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 25 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ. 106.21కి చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 33 పైసలు అధికమై.. లీటర్​కు రూ. 98.68కి చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 26 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ. 107.15కు చేరుకుంది. డీజిల్ ధర వందకు చేరువవుతోంది. ప్రస్తుతం 31 పైసలు పెరిగి.. రూ. 99.1కి చేరింది.
  • గుంటూర్​లో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 25 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ. 108.41గా ఉంది. డీజిల్​ లీటర్​కు 31 పైసలు పెరిగి.. రూ.100.33 వద్ద ఉంది.

ఇదీ చదవండి:భారీగా పెరిగిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

ABOUT THE AUTHOR

...view details