తెలంగాణ

telangana

2020-21లో తగ్గిన ప్యాసింజర్​ వాహన విక్రయాలు

By

Published : Apr 12, 2021, 3:13 PM IST

గత ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. 2020-21 ఏడాదిలో మొత్తం 27,11,457 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 2.24 శాతం తగ్గినట్లు సియామ్​ తాజా గణాంకాల్లో తెలిపింది.

Passenger vehicle sales in India decline by over 2 pc in 2020-21: SIAM
2020-21లో తగ్గిన ప్యాసింజర్​ వాహన విక్రయాలు

2020-21 ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలకు కరోనా వైరస్‌ బ్రేకులు వేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఏడాదిలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2.24 శాతం తగ్గినట్లు భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య(సియామ్​) తెలిపింది. 2019-20లో 27లక్షల 73వేల 519 వాహన విక్రయాలు జరగ్గా.. 2020-21లో ఆ సంఖ్య 27లక్షల 11వేల 457కు పరిమితమైందని వెల్లడించింది. ద్విచక్ర వాహన విక్రయాల్లో ఏకంగా 13.19 శాతం తగ్గుదల కనిపించింది.

2019-20లో కోటి 74లక్షల 16వేల 432 ద్విచక్ర వాహనాలు కంపెనీల నుంచి డీలర్లకు చేరగా 2020-21లో ఆ మొత్తం కోటి 51లక్షల 19వేల 387గా ఉన్నట్లు సియామ్​ వివరించింది. వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 20.77 శాతం మేర తగ్గుదల కనిపించింది.

2019-20లో 7లక్షల 17వేల 593 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2020-21లో 5లక్షల 68వేల 559 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 66.06 శాతం, అన్ని కేటగిరీల్లో వాహన విక్రయాలు 13.6 శాతం మేర తగ్గాయని సియామ్​ పేర్కొంది. కరోనాకు ముందు కూడా వాహన రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తుచేసింది.

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

2019-20 27, 73, 519
2020-21 27, 11, 457
తగ్గుదల 2.24%

ద్విచక్ర వాహన విక్రయాలు

2019-20 1, 74, 16, 432
2020-21 1, 51, 19, 387
తగ్గుదల 13.19%

వాణిజ్య వాహన విక్రయాలు

2019-20 7, 17, 593
2020-21 5, 68, 559
తగ్గుదల 20.77%

త్రిచక్ర వాహన విక్రయాలు

తగ్గుదల 66.06%

అన్ని కేటగిరీల్లో వాహన విక్రయాలు

తగ్గుదల 13.60%

ఇదీ చూడండి:కొత్త ఏడాదిలో జోరుగా వాహన విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details