తెలంగాణ

telangana

సరికొత్త హంగులతో రానున్న కియా 'సోనెట్'​

By

Published : Aug 8, 2020, 3:40 PM IST

సెల్టోస్​, కార్నివాల్ తర్వాత భారత్​లో తయారు చేస్తున్న మూడో మోడల్​ 'సోనెట్' ​ను డిజిటల్​గా విడుదల చేసింది కియా మోటార్స్. హ్యుందాయ్‌ వెన్యూ, మారుతి విటారా బ్రేజా, టాటా నెక్సాన్​, మహీంద్ర ఎక్స్​యూవీ 300లకు పోటీగా వచ్చే నెలలో సోనెట్ శ్రేణిని మార్కెట్​లోకి తీసుకురానుంది. అనంతపురం ప్లాంట్​ నుంచే విదేశాలకు ఎగుమతి చేయనుంది.

Kia unveils India-made Sonet, to be exported other markets
సరికొత్త హంగులతో రానున్న కియా సోనెట్​

దక్షిణ కొరియా దిగ్గజ ఆటో మేకర్​ కియా మోటార్స్​.. భారత్​లో తయారు చేస్తున్న మూడో మోడల్ 'ఎస్​యూవీ సోనెట్​'​ను ప్రపంచవాప్యంగా వర్చువల్​గా విడుదల చేసింది. వచ్చే నెలలో మార్కెట్​లోకి అందుబాటులోకి తీసుకురానుంది. భారత్​లో ఇప్పటివరకు సెల్టోస్​, కార్నివాల్​ మోడల్స్​ను తయారు చేసింది కియా. సోనెట్​​ను కూడా అనంతపురం ప్లాంట్ ​నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.

హ్యుందాయ్​ వెన్యూ, మారుతి విటారా బ్రేజా, టాటా నెక్సాన్​​, మహీంద్ర ఎక్స్​యూవీ 300 వంటి కార్లకు.. అధునాతన ఫీచర్లతో రూపొందిస్తున్న కంపాక్ట్ ఎస్​యూవీ సోనెట్​తో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కియా. ఎస్​యూవీ మార్కెట్ వృద్ధి అవసరాలను తీర్చేలా.. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త అనుభూతినిచ్చేలా సోనెట్​ను తయారు చేస్తున్నట్లు పేర్కొంది.

సెల్టోస్, కార్నివాల్​ తరహాలోనే ఈ మోడల్​కూడా విజయవంతం అవుతుందని కియా నమ్మకంతో ఉంది. సోనెట్​తో భారత విపణిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కూక్యున్ శిమ్ చెప్పారు.

ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

ABOUT THE AUTHOR

...view details