తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 1:13 PM IST

ETV Bharat / business

20న జీఎస్టీ మండలి భేటీ.. కార్లపై పన్ను తగ్గేనా..?

జీఎస్టీ మండలి 37వ సమావేశం ఈ నెల 20న గోవాలో జరగనుంది. ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో అన్ని రకాల వస్తువులపై పన్ను తగ్గింపునకు డిమాండ్​ పెరుగుతోంది. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పన్ను తగ్గింపు ప్రధానాంశంగా ఉండనుంది.

సెప్టెంబర్​ 20న జీఎస్టీ మండలి 37 సమావేశం

వస్తు సేవల పన్నును తగ్గించాలన్న డిమాండ్‌ల నడుమ జీఎస్టీ కౌన్సిల్‌ 37వ సమావేశం వచ్చే శుక్రవారం (సెప్టెంబర్​ 20)గోవాలో జరగనుంది. ఆదాయం దృష్టిలో ఉంచుకుని... కార్ల నుంచి బిస్కెట్ల వరకు పలు ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశం సమావేశంలో చర్చకు రానుందని సమాచారం.

పన్నుల్లో కోత ఉంటే రాష్ట్రాల ఆదాయాలపై పడే ప్రభావంపైనా చర్చించనుంది కౌన్సిల్​. జీఎస్టీ రేట్లను మరింత తగ్గించడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచవచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే పలు రంగాల్లో మందగమనం కేవలం వ్యవస్థీకృత సమస్యల వల్లే వచ్చిందని దానికి జీఎస్టీ కారణం కాదని రాష్ట్రాలు ఇప్పటికే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి:'అక్టోబర్ 8 నుంచి ఆన్​లైన్​లోనూ పన్ను మదింపు'

Last Updated : Sep 30, 2019, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details