తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2019, 2:12 PM IST

Updated : Aug 9, 2019, 2:49 PM IST

ETV Bharat / business

కశ్మీర్​లో పెట్టుబడులకు ప్రోద్బలమిస్తాం: సీఐఐ

ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్​ దిల్లీలో పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్​లో పెట్టుబడులు పెరిగేందుకు పరిశ్రమల సమాఖ్య సహకారం అందిస్తుందని సీఐఐ... ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

కశ్మీర్​లో పెట్టుబడులకు ప్రోద్బలమిస్తాం: సీఐఐ

జమ్ము కశ్మీర్​లో పెట్టుబడి కార్యక్రమాలకు సహకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు హామీ ఇచ్చింది భారత పరిశ్రమల సమాఖ్య- సీఐఐ.

ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై సీఐఐ సభ్యులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోటక్​ మహీంద్ర ఎమ్​డీ, సీఈఓ ఉదయ్​కోటక్.. దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

"జమ్ముకశ్మీర్​లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుబడులు పెంపొందింపజేయడానికి సహకారం అందిస్తామని ఆర్థికమంత్రికి పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హామీ ఇచ్చింది."

-ఉదయ్​ కోటక్, సీఐఐ అధ్యక్షుడు

'సమావేశంలో పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఎంతో విశాల దృక్పథంతో, శ్రద్ధగా విన్నారు. సీఐఐ సభ్యుల సలహాలను పరిశీలిస్తామని సీతారామన్​ హామీ ఇచ్చారు' అని ఉదయ్​ కోటక్​ వెల్లడించారు.

ఎఫ్​పీఐలతో భేటీ

మూలధన మార్కెట్లు, ఆర్థికవ్యవస్థ పురోభివృద్ధికై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతో (ఎఫ్​పీఐ) శుక్రవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ భేటీకానున్నారు.

చారిత్రక నిర్ణయం

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని ఇటీవలే కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్​ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఇదీ చూడండి: ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు

Last Updated : Aug 9, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details