తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ-బుక్​ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​

ఈ-బుక్​ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపింది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్.

By

Published : Apr 4, 2019, 7:42 AM IST

ఈ-బుక్​ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​

దేశంలోనే అత్యంత పెద్ద టెలికాం నెట్​వర్క్​​ ఉన్న భారతీ ఎయిర్​టెల్​ ఈ -బుక్​ సేవల్లోకి అడుగుపెట్టనుంది. 'ఎయిర్​టెల్​ బుక్స్'​ యాప్​ ద్వారా అందించనున్న ఈ సేవలను ఎయిర్​టెల్​తో పాటు ఇతర నెట్​వర్క్​ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

మొదటి 30 రోజుల పాటు ఉచితంగా ఈ యాప్​ వాడుకోవచ్చు. మొదట 70వేల దేశీయ, విదేశీ రచయితల పుస్తకాలతో దీన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆరు నెలలకు రూ.129, సంవత్సరానికి రూ.199 చందా వసూలు చేయనుంది ఎయిర్​టెల్​.

ఇదీ చూడండి:తప్పుడు వార్తలకు 'టిప్​లైన్'​తో కళ్లెం!

ABOUT THE AUTHOR

...view details