తెలంగాణ

telangana

ETV Bharat / business

5 ఏళ్లు-28 మంది పరారీ-18 మంది వెనక్కి

2014 నుంచి ఇప్పటి వరకు వివిధ నేరాలు చేసి మొత్తం 28 మంది దేశం నుంచి పరారయ్యారు. వీరిలో 18 మందిని తన దౌత్య నీతితో విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగింది భారత్​.

By

Published : Mar 21, 2019, 8:45 PM IST

నేరాలు

విజయ్​మాల్యా,నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు. వీరందరు ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్న విడిచివెళ్లిన వారే. మనకు తెలిసింది ఈ ముగ్గురు మాత్రమే.

కానీ ఆర్థిక నేరాలతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడి గత ఐదేళ్లలో ఎంత మంది దేశం విడిచి పరారయ్యారో తెలుసా? ...అక్షరాలా 28 మంది. వీరిలో 18 మందిని విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగింది మోదీ సర్కారు.

వివిధ దేశాలకు పారిపోయిన ఈ 18 మందిని తీసుకురావటంలో భారతదేశం దౌత్య పరంగా ఎంతో కృషి చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్లపై చర్యలకు 2018లో బ్యూనస్ ఎయిర్స్​లో జరిగిన జీ-20 సమావేశంలో 9 సూత్రాల ఎజెండాను ప్రతిపాదించింది భారత్. ఈ సూత్రాలే నేరాలకు పాల్పడి దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్న వారిపట్ల యమపాశాలయ్యాయి.

భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది వీరినే:

దేశం మోపబడిన నేరం ఏ దేశం నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు
రాజీవ్​ సక్సేనా అగస్టా వెస్ట్​ లాండ్​ హెలికాఫ్టర్ల కొనుగోలులో అక్రమాలు దుబాయ్ జనవరి 31,2019
మైఖెల్​ జేమ్స్ అగస్టాల్​ వెస్ట్​ లాండ్​ కేసులో మధ్యవర్తిత్వం వహించి అక్రమాలకు పాల్పడ్డారు దుబాయ్ డిసెంబర్​ 4, 2018
మహ్మద్​ యాహ ఫోర్జరీ, మోసం ఇండోనేషియా అక్టోబర్​ 12, 2018
వినయ్​ మిట్టల్ ఫోర్జరీ ఇండోనేషియా మార్చి 8, 2018
మన్సూర్ తీవ్రవాద కార్యకలాపాలు దుబాయ్ మార్చి 8, 2018
మహ్మద్ ఫరూక్ యాసిన్ బ్యాంకును మోసగించారు రొమేనియా మార్చి 3, 2018
అబు బకర్ కదీర్ నిరుద్యోగులను మోసం చేశాడు సింగపూర్ సెప్టెంబర్​ 23, 2017
మహ్మద్​ సుల్తాన్ హత్య బంగ్లాదేశ్ నవంబర్​ 8 ,2016
వినూ భాయి పటేల్ హత్య బ్రిటన్ అక్టోబర్​ 19,2016
కుమార్​ కృష్ణ హత్యాయత్నం సింగపూర్ జూన్​ 27, 2016
అబ్దుల్​ వహీద్​​ దేశంపై కుట్ర దుబాయ్ మే 20,2016
నారు ఎంట్రావానిక్ దేశంపై కుట్ర థాయ్​లాండ్ నవబర్​ 11, 2015
కొల్లాం గంగి రెడ్డి హత్యాయత్నం మారిషస్ నవంబర్​ 15, 2015
అనూప్​ చతియా దేశంపై కుట్ర బంగ్లాదేశ్ నవంబర్​11, 2015
చోటా రాజన్ అపహరణ,హత్య ఇండోనేషియా నవంబర్ 6,2015
బనాజీ రాజా హత్య మొరాకో ఆగస్టు 14, 2015
జగతర్​ సింగ్​​ హత్య థాయిలాండ్ జనవరి 16,2015

9 సుత్రాల్లోని ముఖ్యాంశాలు:

  • ఆర్థిక నేరాలు, అవినీతి, ఇతర నేరాలకు పాల్పడిన వారు సభ్య దేశాల్లో ఏదైనా దేశంలో తలదాచుకుంటే వారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.
  • ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న వారి ఆస్తులు సభ్య దేశాల్లో ఉంటే వారి ఆస్తులను జప్తు చేయాలి.
  • తమ దేశంలో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్ల పూర్తి సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకోవాలి.
  • తమ దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్లపై సత్వర న్యాయ విచారణ చేపట్టి వారి దేశానికి వెంటనే అప్పగించేందుకు చర్యలు చేపట్టాలి.
  • తమ దేశానికి వచ్చేవారు ఏదైనా ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే వారిని దేశంలోకి అనుమతించకూడదు.
  • జీ-20 సభ్య దేశాల్లో ఐకరాజ్య సమితి చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి.
  • నేరాల నివారణకు జీ-20 సభ్య దేశాలు ఒక వేదికను ఏర్పాటు చేయాలి. సభ్య దేశాల అధికారులకు నేర నియంత్రణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.

ABOUT THE AUTHOR

...view details