తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2019, 7:00 AM IST

Updated : Feb 16, 2019, 11:18 AM IST

ETV Bharat / briefs

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ

జమ్ములో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. కేంద్రం తర్వాత తీసుకునే చర్యలపై దృష్టి పెట్టింది.

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ...

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ...
జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రం తదుపరి చర్యలపై నేడు సమావేశం కానుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ నేడు సమావేశంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనుంది. వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

ఈ భేటీ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు జరగనున్నట్లు అధికారుల సమాచారం. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీలో రక్షణ మంత్రి, హోం శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి ఉండనున్నారు. ఇందులో భద్రతతో పాటు, వ్యూహాత్మక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Last Updated : Feb 16, 2019, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details