తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు'

ఇంటర్​బోర్డు కార్యాలయాన్ని అఖిలపక్షం నేతలు, విద్యార్థిసంఘాల నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Apr 29, 2019, 12:27 PM IST

protest at inter board

ఇంటర్​బోర్డు కార్యాలయం ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థిసంఘాల నాయకులు, అఖిల పక్షం నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ ​చేయాలని, గ్లోబరీనా సంస్థపై క్రిమినల్​ చర్యలు తీసుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్​ డిమాండ్​ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని విద్యార్థిసంఘం నాయకులు అన్నారు.

'న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు'

ABOUT THE AUTHOR

...view details