తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జీఎస్​టీ భేటీ: వాహన రంగానికి ఊరట లభించేనా..?

By

Published : Sep 20, 2019, 11:08 AM IST

Updated : Oct 1, 2019, 7:33 AM IST

జీఎస్టీ భేటీకి ముందు నిర్మలా మీడియా సమావేశం

12:03 September 20

గోవాలో జీఎస్​టీ సమావేశం ప్రారంభం

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా పలు కీలక ఉద్దీపనలు ప్రకటించిన అనంతరం.. గోవా పనాజీలో జీఎస్​టీ మండలి సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వంలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది వస్తు సేవల పన్ను కౌన్సిల్​. 

11:09 September 20

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన చర్యలు

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పలు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కార్పొరేట్‌ పన్ను  తగ్గిస్తున్నట్లు జీఎస్టీ సమావేశానికి ముందు మీడియా సమావేశంలో ప్రకటించారు. దేశీయ కంపెనీలకు అన్ని సెస్, సర్‌చార్జీలతో సహా  కార్పొరేట్ పన్నును ప్రభుత్వం  25.17 శాతానికి తగ్గించారు. ఈ కొత్త పన్ను రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా వచ్చే  రాబడి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయల రాబడి  తగ్గుతుందని నిర్మలా అంచనా వేశారు.

10:47 September 20

జీఎస్టీ భేటీకి ముందు నిర్మలా మీడియా సమావేశం

గోవాలో జీఎస్​టీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పలు కీలక ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కొత్త దేశీయ తయారీ సంస్థలకూ కార్పొరేట్​ పన్ను ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ​ఇంకా ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన తీసుకొస్తామని వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా ఈ నిబంధన తీసుకొస్తామన్నారు. 

Last Updated : Oct 1, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details