కలెక్టరేట్ ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు సమర్పించారు.
ప్రజావాణికి కదలివచ్చిన ప్రజలు
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.