తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'38 వేల కోట్ల ప్రాజెక్టును 80 వేల కోట్లకు పెంచారు'

గత రెండ్రోజులుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందినవి కావని నీటిపారుదల మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగమైన గతంలో ప్రారంభించిన పనులను ప్రయోగాత్మకంగా విడుదల చేస్తున్నారన్నారు.

By

Published : Apr 27, 2019, 7:08 PM IST

పొన్నాల లక్ష్మయ్య

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్కన పెట్టిన వైనాన్ని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రావిటీతో నీరు వచ్చే అవకాశం ఉన్నా... ఎత్తిపోతల పథకాలను ప్రవేశపెట్టి అంచనాలను ఏ విధంగా పెంచారో పేర్కొన్నారు. 2014 నాటి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులో దాదాపు 9వేల కోట్లు ఖర్చు చేస్తే... గ్రావిటీ కెనాల్‌ను పక్కన పెట్టి కొత్త స్కీమ్‌ తీసుకొచ్చి, 38వేల ప్రాజెక్టును 80వేలకు పెంచి కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టారని మండిపడ్డారు.

నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

ABOUT THE AUTHOR

...view details