తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రఫేల్​పై మరోమారు దద్దరిల్లిన లోక్​సభ

రఫేల్​ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్​ పట్టుబట్టింది. విపక్షం ఆరోపణల్ని అధికార పక్షం దీటుగా తిప్పికొట్టింది.

By

Published : Feb 8, 2019, 3:39 PM IST

రఫేల్​పై మరోమారు దద్దరిల్లిన లోక్​సభ

రఫేల్​ వ్యవహారంపై లోక్​సభ మరోసారి అట్టుడికింది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని నరేంద్ర మోదీ రూ.30 వేల కోట్లు అనిల్​ అంబానీకి అందేలా చేశారని కాంగ్రెస్​ ఆరోపించింది. అందుకనుగుణంగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో ప్రధానమంత్రి కార్యాలయం చర్చలు కూడా జరిపిందని విమర్శించింది.

రఫేల్​పై మరోమారు దద్దరిల్లిన లోక్​సభ

రఫేల్​ ఒప్పందంపై పదేపదే చర్చ అవసరం లేదు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ-జేపీసీ ఏర్పాటు చేయండి. మేము అన్నీ అబద్ధాలు చెబుతున్నామని అంటున్నారు. జేపీసీ ఏర్పాటు చేస్తే నిజమేంటో బయటపడుతుంది. ఒప్పందంలోని పూర్తి వివరాలు తెలుస్తాయి. అందుకే మాకు ఎలాంటి వివరణ అవసరం లేదు. జేపీసీ ఏర్పాటు చేయాలన్నదే మా ఏకైక డిమాండ్​.
-మల్లికార్జున ఖర్గే, లోక్​సభలో కాంగ్రెస్​ పక్షనేత

కాంగ్రెస్​ ఆరోపణలను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ తిప్పికొట్టారు.

రఫేల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుంటందన్న ఆరోపణలపై జనవరి 4న సభలో వివరణ ఇచ్చాను. ఏదైనా ఒక పని పురోగతిని పీఎంఓ పదేపదే అడిగి తెలసుకోవటం, ఆ పనిలో కలుగచేసుకోవడం జరగదని అప్పుడే తేల్చిచెప్పాం. సభకు ఒక విషయాన్ని గుర్తుచేయదలిచా. గతంలో సోనియాగాంధీ నేతృత్వంలోని ఎన్​ఏసీ(జాతీయ సలహా మండలి​) పీఎంఓ విషయాల్లో కలుగజేసుకోడాన్ని ఏమంటారు? అది జోక్యం చేసుకోవడమా? ఒకవేళ అది జోక్యం చేసుకోవడమైతే అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడండి.
-నిర్మలా సీతారామన్​, రక్షణశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details