తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2019, 5:07 PM IST

Updated : Jun 19, 2019, 5:38 PM IST

ETV Bharat / briefs

'24న తెరాస కార్యాలయాలకు శంకుస్థాపన'

తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

palla

తెలంగాణకు తెరాస రక్షణ కవచంగా మారిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మూడేళ్లలో పూర్తిచేశారని తెలిపారు. తెరాస కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చ జరిగిందని వివరించారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా తెరాస కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 27 నుంచి నెల రోజుల పాటు తెరాస సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 27న కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ మరోసారి భేటీ అవుతారని చెప్పారు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

'తెలంగాణకు తెరాస రక్షణ కవచంగా మారింది'
Last Updated : Jun 19, 2019, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details